పాకిస్తాన్ కస్టడీలో ఉన్న 631 మత్స్యకారులు, ఇద్దరు పౌరులను విడుదల చేయాల్సిందిగా కేంద్రం ఆ దేశాన్ని కోరింది.
వారంతా భారతీయులని నిర్ధారణ కావడం, కారాగారవాసం ముగియడంతో స్వదేశానికి పంపాలని కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. మరో 30 మంది మత్స్యకారులు, 22మంది పౌరఖైదీలను భారతీయులుగా విశ్వసిస్తున్నామంది. అందుకు అవసరమైన దౌత్య అవకాశాలను కల్పించాలని కూడా కోరినట్టు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. 2008 ఒప్పందంలో భాగంగా జనవరి 1, జూలై 1న ఇరుదేశాలకు చెందిన మత్స్యకారులు, ఖైదీల జాబితాను పరస్పరం ఇచ్చిపుచ్చుకుంటున్న క్రమంలో భారత్ ఈ విజ్ఞప్తి చేసింది.