కోవిడ్ వ్యాప్తి కారణంగా రంజాన్ పండగను ముస్లింలంతా ఇళ్లల్లోనే జరుపుకోవాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్సజ్జనార్ సూచించారు. వైరస్ ఉదృంతంగా వ్యాపిస్తున్నందున ఎవరూ ఇళ్లనుంచి రాకుంటేనే మంచిదని అన్నారు. ఆరంఘర్ చౌరస్తాలో ఏర్పాటుచేసిన చెక్పోస్ట్ను ఆయన స్వయంగా తనిఖీ చేశారు. అత్యవసర పనుల్లేకుండానే రోడ్డుమీదకు కావాలని వచ్చిన వారి వాహనాలను జప్తు చేశారు. లాక్ డౌన్ సందర్భంగా దాదాపు ప్రజలంతా సహకరిస్తున్నారని చెప్పారు. ఇప్పటికే నిర్ణయించుకున్న పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు హాజరయ్యేవారు ఈ పాస్ ద్వారా దరఖాస్తు చేసుకుని అనుమతి తీసుకోవాలని సజ్జనార్ అన్నారు.