దేశంలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ విజృంభిస్తుండటంతో కేంద్రం అప్రమత్తమవుతోంది. ఓ వైపు లాక్డౌన్ విధించమని చెప్తూనే.. రాష్ట్రాలపై భారాన్ని మోపుతోంది. ఈ క్రమంలో కేంద్ర విద్యాశాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. సీబీఎస్ఈ టెన్త్ క్లాస్ పరీక్షలను ఈ ఏడాది రద్దు చేసింది. అంతేకాదు.. 12వ తరగతి పరీక్షలను సైతం వాయిదా వేస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది. గత కొద్ది రోజులుగా దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో.. పలు రాష్ట్ర ప్రభుత్వాలు పరీక్షలు రద్దుచేయాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్రంపై ఒత్తడి తేవడంతో.. బుధవారం నాడు ప్రధాని మోదీతో సమావేశమైన అనంతరం కేంద్ర విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే 12వ తరగతి పరీక్షలను జూన్1వ తేదీన పరిస్థితులను బట్టి కొత్త తేదీలను ప్రకటిస్తామని పేర్కొంది.
కాగా, కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై పలు రాష్ట్రాలు హర్షం వ్యక్తం చేశాయి. కరోనా కేసులు పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా ఎంతో ఉపయోగం ఉంటుందని పలువురు పేర్కొన్నారు.
https://twitter.com/ANI/status/1382249447069937671