సీబీఎస్ఈ పదోతరగతి, 12వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఉదయం పన్నెండోతరగతి ఫలితాలు, మధ్యాహ్నం పదోతరగతి ఫలితాలు విడుదలయ్యాయి. టెన్త్ ఫలితాలు అధికారిక వెబ్సైట్ www.cbse.gov.in/ లేదా cbseresults.nic.in/ లో చూసుకోవచ్చు. ఈ రోజు ఉదయమే సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఒకే రోజు సీబీఎస్ టెన్త్, 12వ తరగతి ఫలితాలను విడుదల చేయడం ఇదే తొలిసారి. సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షల్లో 94.4 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బాలికల ఉత్తీర్ణతా 95.21 శాతంగా ఉంటే.. బాలుర ఉత్తీర్ణత 93.80 శాతంగా ఉంది. ట్రాన్స్ జండర్లు 90 శాతం ఉత్తీర్ణత సాధించారు. అయితే టాపర్స్ జాబితాను సీబీఎస్ఈ విడుదల చేయలేదు. 11.32 శాతం విద్యార్థులు 90 శాతం మార్కులు సాధించగా.. 3.10 శాతం విద్యార్థులు 95 శాతం స్కోర్ చేశారు.