డిల్లీ మద్యం కేసులో సీబీఐ తొలిచార్జిషీట్ దాఖలు చేసింది. 10వేల పేజీల చార్జిషీట్లో నిందితులుగా హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్ను పేర్కొంది.
మొదటి అరెస్ట్ జరిగిన నాటి నుంచి 60 రోజుల్లోపు ఛార్జ్షీట్ దాఖలు చేయాల్సి ఉండగా నేటితో ఆ గడువు ముగియనుండడంతో… ట్రయల్ కోర్టు ముందు సీబీఐ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ కుల్దీప్ సింగ్, ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ నరేంద్ర సింగ్ పేర్లను కూడా ఛార్జ్షీటులో పేర్కొంది. ఛార్జ్షీట్లో A1-కుల్దీప్ సింగ్, A2-నరేంద్ర సింగ్, A3-విజయ్ నాయర్, A4-అభిషేక్ బోయినపల్లి పేర్లు చేర్చింది. ఇదే కేసులో ఒకట్రెండు రోజుల్లో ఈడీ కూడా ఛార్జ్షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. సాక్షులు ఇచ్చిన సమాచారం.. ఆధారాలను ఛార్జ్షీట్కు అనుబంధంగా కోర్టుకు సమర్పించింది. ఇక సీఎఫ్ఎస్ఎల్కు పంపిన వస్తువుల రిపోర్ట్స్ రావాల్సి ఉందని తెలిపింది. మొత్తం ఏడుగురిపై ఛార్జ్షీట్ దాఖలు చేసినట్టు చెప్పిన సీబీఐ….వారిలో అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్లను మాత్రం అరెస్ట్ చేసినట్లు చూపించింది. మిగతా ఐదుగురిని అరెస్ట్ చేయలేదని ఛార్జ్షీట్లో పేర్కొంది. అయితే ఆ ఇద్దరికీ కూడా కోర్టు బెయిల్ మంజూరు చేసింది.