బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి నివాసంలో ఇవాళ సీబీఐ సోదాలు నిర్వహించింది. రబ్రీదేవి కుమారుడు, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ విధానసభకు వెళ్లిన కొద్ది సేపటికే సీబీఐ బృందం వారింటికెళ్లింది. ఐఆర్సీటీసీ స్కామ్ కేసులో వారం రోజుల క్రితం రబ్రీదేవికి, ఆమె భర్త లాలూ ప్రసాద్ యాదవ్కు ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసిన నేపథ్యంలో సీబీఐ సోదాలుచేసింది. ఆ సమయంలో రబ్రీ చిన్న కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ఇంట్లోనే ఉన్నారు. మీడియా వాళ్లు చుట్టుముట్టినా ఆయన ఏంమాట్లాడకుండానే వెళ్లిపోయారు. లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు బీహార్లోని అభ్యర్థుల నుంచి వ్యవసాయ భూములను తీసుకుని వారికి రైల్వేశాఖలో ఉద్యోగాలు ఇప్పించారనే ఆరోపణలున్నాయి. దీనిపై సీబీఐ అప్పట్లోనే కేసు నమోదు చేసింది.