ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా నివాసంలో సీబీఐ ఈరోజు ఉదయం మెరుపు దాడులు నిర్వహించింది. సిసోడియా నివాసంతో పాటు పరిసర ప్రాంతాల్లో 20కి పైగా ప్రదేశాల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. ఢిల్లీ నూతన మద్యం పాలసీ కేసులో మనీశ్ సిసోడియాపై ఆరోపణలు రావడంతో ఆయన నివాసంలో దాడులు చేపట్టింది.
సీబీఐ దాడులపై మనీష్ సిసోడియా స్పందించారు. సీబీఐ మా నివాసంలో సోదాలు చేస్తోంది.. దర్యాప్తు సంస్థకు సహకరిస్తాను.. అయినా నాకు వ్యతిరేకంగా వాళ్లు ఏమీ గుర్తించలేరని ఆయన ట్వీట్ చేశారు. దేశంలో మంచి చేసే వారిని ఇలా వేధింపులకు గురిచేయడం దురదుష్టకరం. విద్యా రంగంలో నేను చేస్తున్న పనిని ఎవరూ ఆపలేరు. నిజం బయటకు వస్తుందన్నారు.
సీబీఐ దాడులపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. దర్యాప్తు సంస్థ గతంలో తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన సోదాల్లో ఏమీ గుర్తించలేకపోయింది.. ఇప్పుడు కూడా అదే జరగనుందని అన్నారు.
https://twitter.com/ANI/status/1560469175126016000?s=20&t=Db3OeEpI9bRljvlXwEL4ZA