పశ్చిమబెంగాల్లో సంచలనం రేపిన ఉపాధ్యాయుల నియామకాల స్కాంలో సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ను సీబీఐ శనివారం ప్రశ్నించింది.టీఎంసీ నేతలకు సన్నిహితుడైన సుజయ్ కృష్ణ భద్ర నివాసంలో అంతకుముందు రోజు ఈడీ దాడులు చేసింది. భారీ బందోబస్తు మధ్య అభిషేక్ నిజాం ప్యాలెస్లోని సీబీఐ కార్యాలయానికి వచ్చారు.
ఇదే వ్యవహారంలో మార్చి 15వతేదీన భద్ర సీబీఐ ఎదుట హాజరయ్యారు. తనపై ఆరోపణలు సరికాదని…ఆధారాలుంటే అరెస్ట్ చేసుకోవచ్చని ఇటీవలే ఓ ర్యాలీలో అభిషేక్ బెనర్జీ అన్నారు.టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్లో సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలు తనను విచారించవచ్చని గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలను రీకాల్ చేయాలని కోరుతూ బెనర్జీ దాఖలు చేసిన పిటిషన్ను కోల్ కత్తా హైకోర్టు గురువారం కొట్టివేసింది.
#WATCH | TMC National General Secretary and MP Abhishek Banerjee arrives at the CBI office in Kolkata, in the Kuntal Ghosh letter case. pic.twitter.com/R9snJ8Upun
— ANI (@ANI) May 20, 2023