వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు వేగవంతం చేసింది. పులివెందులలోనే అధికారులు విచారణ మొదలుపెట్టారు. అప్రూవర్ గా మారిన దస్తగిరి వాంగ్మూలాన్ని పోలీసులు మరోసారి నమోదు చేశారు. గతేడాది ఆగస్టులో కోర్టులో దస్తగిరి వాంగ్మూలం ఇచ్చాడు. 2019 మార్చి 15న తనింట్లోనే వివేకా అనుమానాస్పద స్థితిలో చనిపోయిన సంగతి తెలిసిందే. తన తండ్రిని హత్య చేశారని సునీత ఆరోపించగా కేసును సిట్ కు అప్పగించారు. అయితే సిట్ విచారణలో పురోగతి లేదని…, సీబీఐకి కేసు దర్యాప్తును అప్పగించాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు అనుమతితో విచారణ జరుగుతోంది. దస్తగిరిని అప్రూవర్ గా పరిగణించడాన్నీ ఆమోదించింది కోర్టు. దీనిపై కడప చీఫ్ జ్యూడీషియల్ మెజిస్ట్రేట్ ఇచ్చిన తీర్పును సమర్థించిన అత్యున్నత ధర్మాసనం… ఆ తీర్పును సవాల్ చేస్తూ నిందితులు గంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లను కొట్టేసింది.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)