వైఎస్ వివేకా హత్యకేసులో సీబీఐ దూకుడు పెంచింది.
నిన్న అవినాశ్ రెడ్డిని విచారించిన సీబీఐ..ఇవాళ
కడప సెంట్రల్ జైల్లో భాస్కర్ రెడ్డిని విచారిస్తోంది. భాస్కర్ రెడ్డి.. వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తండ్రి. విచారణకు హాజరు కావాలంటూ నిన్న ఆయనకు వాట్సాప్ ద్వారా మరోసారి నోటీసులు పంపించింది. వివేకా హత్య గురించి అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలను ముందే తెలుసని సీబీఐ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ హత్యలో భాస్కర్ రెడ్డిని కుట్రదారుడిగా సీబీఐ నిర్ధారించింది.