వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ ఎదుట హాజరయ్యారు. దీంతో సీబీఐ ఆఫీస్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. కోఠీలోని సీబీఐ కార్యాలయం దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. మధ్యాహ్నం 3గంటలకు అధికారుల ఎదుట హాజరయ్యారు. సీబీఐ ఎస్పీ రామ్సింగ్ ఆధ్వర్యంలో అవినాష్ ను విచారించారు. న్యాయవాది సమక్షంలో సీబీఐ విచారణ జరగాలని మొదట్నుంచీ అవినాష్ కోరుతున్నా…విచారణ గదిలోకి లాయర్లను సీబీఐ అనుమతించలేదు.