రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ స్కాం కేసులో బిహార్ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వియాదవ్ కు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలంటూ ఢిల్లీ హైకోర్టుకు వెళ్లింది సీబీఐ. అయితే సీబీఐకి సమాధానం ఇవ్వాలంటూ తేజస్వికి నోటీస్ పంపారు ప్రత్యేక న్యాయమూర్తి గీతాంజలి గోయెల్. ఈ కేసులో తేజస్వితో పాటు ఆయన తల్లి రబ్రీ దేవికి 2018 ఆగస్టులో బెయిల్ మంజూరైంది. ఈ వ్యవహారంలో 12మందిపైన, రెండు కంపెనీలపైనా సీబీఐ కేసు నమోదు చేసింది. 2006లో రాంచీ, పూరీల్లో ఐఆర్సీటీసీ హోటల్స్ కాంట్రాక్ట్ లో అవకతవకలు జరిగాయన్నది సీబీఐ అభియోగం. ఈడీ కూడా చార్జిషీట్ దాఖలు చేసింది. ఇక ఇటీవల ప్రెస్మీట్లో మాట్లాడుతూ… తమ అధికారులను తేజస్వి బెదిరించారని కోర్టుకు తెలిపింది సీబీఐ.