ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జిషీట్ పై సీబీఐ కోర్ట్ విచారణ జరిపింది. చార్జిషీట్ ను పరిగణనలోకి తీసుకునే అంశంపై ఈనెల 20న విచారణ జరుపుతామని సీబీఐ కోర్టు తెలిపింది. 13,656 పేజీలతో సప్లిమెంటరీ చార్జిషీట్ దాఖలు చేసినట్టు సీబీఐ కోర్టుకు ఈడీ అధికారులు తెలిపారు. దీనిలో తాజాగా 5గురు నిందితులు, 7 కంపెనీలపై అభియోగాలు మోపారు. ఇప్పటి వరకూ ఈడీ దాఖలు చేసిన మొత్తం చార్జిషీట్లో ఆరుగురు, 11 కంపెనీలు ఉన్నాయి. చార్జీ షీట్లో ఇప్పటి వరకు 17 మంది నిందితులుగా చేర్చింది ఈడీ పేర్కొంది. సమీర్ మహేంద్రు, శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబు, అమిత్ అరోరా, అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్.. ఈడీ దాఖలు చేసిన సప్లైమెంటరీ చార్జిషీట్లో ఉన్నారు.