SSC పేపర్ లీకేజీ కేసులో హన్మకొండ డీసీపీకి ఈటల రాజేందర్ స్టేట్మెంట్ ఇచ్చారు. తన ఫోన్ ను పోలీసులకు అందజేసిన ఈటల వారు అడిగిన సమాచారం ఇచ్చారు. పోలీసు నోటీసులో పేర్కొన్న ఫోన్ నెంబర్ నుంచి ఎలాంటి వాట్సప్ మెసేజ్ తనకు రాలేదన్నారు. వేరే నెంబర్ నుంచి వచ్చిన మెసేజ్ ను కూడా తాను చూడలేదని పోలీసులకు ఈటల వివరణ ఇచ్చారు. బయటకు వచ్చిన అనంతరం ఈటల మీడియాతో మాట్లాడారు. అసలు 9.30 కి పరీక్ష మొదలై 11 గంటల తరువాత పేపర్ బయటికి వస్తే దానిని పేపర్ లీక్ ఎలా అంటారని ప్రశ్నించిన ఈటల… కేసీఆర్ ప్రగతి భవన్లో కూర్చుని తమను ఇరికించేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. Tspsc ఆరు పరీక్ష పేపర్స్ లీక్ అయ్యాయని… వాటిమీద నెగటివ్ చర్చ జరుగుతుంటే డైవర్ట్ చేసేందుకే తమమీద ఈ కేసులని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా ఎన్నికల ఖర్చును తానే పెడతానని కేసీఆర్ అన్నట్టు సీనియర్ జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్ చెప్పారని… దానిమీద చర్చ జరగవద్దనే ఈ కేసులని ఆయన అన్నారు. 20ఏళ్లుగా ప్రజాజీవితంలో ఉన్నానని..విలువలతో కూడిన రాజకీయమే చేశానని అన్నారు. పరీక్షల సమయంలో విద్యార్థులతో ఇంటరాక్ట్ అయి ధైర్యం చెప్తున్న ఏకైక ప్రధాని మోదీ అని ఆయన అన్నారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అంశాన్ని తప్పుదోవ పట్టించేందుకు మాపై కేసులు, నోటీసులు-ఈటల
Share: