ఫోన్లో మూడు సార్లు తలాక్ చెప్పిన మధ్యప్రదేశ్ ఇండోర్ కు చెందిన మహ్మద్ ఖాన్ అనే వ్యక్తిని అతని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశాడు. సెప్టెంబర్ 21 ఫోన్ లో తనకు తలాక్ చెప్పాడంటూ అతని భార్య ఫిర్యాదు చేసిందని పోలీసులు తెలిపారు. కట్నం కోసం తన అత్తమామలు కూడా వేధించారని మహిళ ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ముస్లిం మహిళల వివాహంపై హక్కుల పరిరక్షణ …ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆన్ మ్యారెజ్ కింద …. 2019 నిబంధనల ప్రకారం నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.అయితే ఇంతవరకూ ఎవరినీ అరెస్ట్ చేయలేదు.
త్రిపుల్ తలాక్ ను నిషేధిస్తూ 2019 ఆగస్టులో భారత ప్రభుత్వం చట్టం తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అది అనాగరిక ఆచారమని, రాజ్యాంగ విరుద్ధమనీ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన తరువాత…ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు త్రిపుల్ తలాక్ ను నిషేధిస్తూ నూతన చట్టాన్ని రూపొందించింది. దాని ప్రకారం ఈ చట్టం ప్రకారం త్రిపుల్ తలాక్ చెల్లుబాటు కాదు. అది పూర్తిగా చట్టవ్యతిరేకం కూడా.