ఫిబ్రవరి 8న ఝూర్ఖండ్లోని హజారీబాగ్ లో హత్యకు గురైన రూపేష్ పాండే కేసులో 27 మంది ముస్లింలు, వంద మంది అజ్ఞాతవ్యక్తులపై కేసు నమోదైంది. హజారీబాగ్ నగర బిజెపి ఎమ్మెల్యే మనీష్ జైస్వాల్ బాధిత కుటుంబానికి మద్దతుగా నిలుస్తూ వచ్చారు. యువకుడి కుటుంబానికి న్యాయం కోసం ఇంకా పోరాటం చేస్తున్నారు.
ఫిబ్రవరి 2న సరస్వతీ పూజా తరువాత నిమజ్జనం సందర్భంగా జరిగిన ఘర్షణలో రూపేష్ పాండేను ముస్లింల గుంపు దాడి చేసింది. స్థానికుడైన సికిందర్ పాండే 17 ఏళ్ల బాలుడు రమేశ్.
హజారీబాగ్లోని నై తాండ్ గ్రామానికి చెందిన ముస్లింలు అటుగా వెళ్తున్న హిందూ భక్తులతో గొడవకు దిగారు. పరస్పర దాడులు చేసుకున్నారు. ఈ గొడవల్లో రమేష్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలిస్తుండగానే చనిపోయాడు. ఘటన జరిగిన వెంటనే ఎస్పీ రతన్ చౌతే రంగంలోకి దిగారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని..పరిస్థితులు అదుపులో ఉన్నాయని చెప్పారు. అయితే స్థానిక ప్రజలు హంతకుల వివరాలు బయటపెట్టారు. వీరిలో మహ్మద్ అస్లాం, మహ్మద్ అనిస్, మహ్మద్ కైఫ్, మహ్మద్ గుఫ్రాన్, మహ్మద్ చంద్, మహ్మద్ ఒసామా, మహ్మద్ ఎహతామ్, మహ్మద్ నహిద్ ఉన్నారు. మొత్తం 27మంది నిందితులపై, వంద మంది గుర్తుతెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు.
అటు పాండే కుటుంబానికి మద్దతుగా రాష్ట్ర బీజేపీ నేతలు, స్థానిక ఎమ్మెల్యే మనీష్ జైస్వాల్ రంగంలోకి దిగారు. రూపేశ్ పాండేను లక్ష్యంగా చేసుకునే సరస్వతీ మాత ఊరేగింపును చుట్టుముట్టి హింసకు పాల్పడ్డారని ఆరోపించారు. దాన్ని మూకదాడిగా పరిగణిస్తూ నిందితులపై అభియోగాలు మోపాలని ఝార్ఖండ్ బీజేపీ చీఫ్ దీపక్ ప్రకాశ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దోషుల్ని రక్షిస్తోందని మండిపడ్డారు. మూకదాడి విజువల్స్ ను, రూపేష్ భౌతికకాయం ఫొటోను జతచేస్తూ రమేష్ జైస్వాల్ ట్వీట్ చేశారు. అతని అంత్యక్రియల్లోనూ పాల్గొన్నారు.
జార్ఖండ్ లోని చేతకాని ప్రభుత్వం ఈ ఘటనపై వెంటనే చర్యలకు దిగకుండా…హజారీబాగ్, గిరిది, ఛత్ర మరియు రామ్గఢ్లలో ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలిగించిందని..ఇది ఎంతో అవమానకరమని…యువకుడి కోసం న్యాయపోరాటం కొనసాగుంతుందని…అసెంబ్లీలో ఈ అంశాన్ని లేవనెత్తుతానని అన్నారు. .ఇది చాలా బాధాకరం, అవమానకరం. న్యాయం కోసం పోరాటం సాగుతోంది. రూపేష్ పాండే పేరు అసెంబ్లీలో ప్రతిధ్వనిస్తుందని నేను హామీ ఇస్తున్నాను.
చనిపోయిన బాలుడి దహన సంస్కారాల వీడియోను కూడా పోస్ట్ చేశాడు. ఈ విషాద సమయంలో బాధిత కుటుంబానికి అందరూ అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. తన కారు ద్వారా ఆ ఇరుకైన దారిలో ఇబ్బంది కలగకూడదనే ద్విచక్రవాహనంపై వెళ్లానని అన్నారు. మూకదాడి చట్టం కింద చర్యలు తీసుకోవాలని…ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా త్వరిత గతిన విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్క్షించేలా చర్యలు తీసుకోవాలని, రమేశ్ కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలని స్థానిక బీజేపీ నాయకులు సహా స్థానికులూ డిమాండ్ చేస్తున్నారు. ఆ కుటుంబానికి న్యాయం జరిగేవరకూ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేస్తున్నారు.
ఇందుకోసం నిధుల సమీకరణ కూడా కొనసాగుతోంది. ఎమ్మెల్యే తన వంతుగా 51 వేలు ఇస్తానని ప్రకటించారు. స్థానికుల నిరసనలు ఉధృతం కావడంతో జిల్లాలో ఇంటర్నెట్ సేవల్ని పునరుద్ధరించారు.