ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. సంక్రాంతి లక్కీ డ్రా వ్యవహారంలో ఆయనపై ఫిర్యాదులు వచ్చాయి. లాటరీ వసూళ్లపై జనసేన నేతలు కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. కోర్టు ఆదేశాలతో సత్తెనపల్లి పోలీసులు మంత్రిపై కేసు నమోదు చేశారు. చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ నిషేధ చట్టం కింద కేసు నమోదైంది.