ఆర్మీ హెలికాఫ్టర్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్సపొందుతూ కన్నుమూసిన గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ అంత్యక్రియలు ప్రభుత్వ, సైనిక లాంఛనాలతో ముగిశాయి. పెద్దసంఖ్యలో బంధుమిత్రులు, చుట్టుపక్కల గ్రామాలవాళ్లూ వరుణ్ సింగ్ అంతిమయాత్రలో పాల్గొని కన్నీటివీడ్కోలు పలికారు.
మధ్యప్రదేశ్ భోపాల్ జిల్లాలోని భైరాగడ్ లో జరిగిన అంత్యక్రియల్లో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సహా పలువురు పాల్గొన్నారు. వరుణ్ కుటుంబానికి కోటి రూపాయలతో పాటు…కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని సీఎం ఇప్పటికే ప్రకటించారు.