ఈనెల 8న కూనూరులో జరిగిన ఆర్మీ హెలికాఫ్టర్ ప్రమాదం నుంచి బయటపడిన ఒకే ఒక్కడు ఇవాళ కన్నుమూశారు. ఏడు రోజులపాటు మృత్యువుతో పోరాడిన వరుణ్ ఓడిపోయారు. నాటి ప్రమాదంలో 14 మందికి గానూ పదమూడు మంది ఆరోజే చనిపోయారు. తీవ్రగాయాలతో బయటపడిన గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ బెంగళూరులోని కమాండ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. కెప్టెన్ వరుణ్ సింగ్ మరణం పట్ల ఇండియన్ ఆర్మీ సంతాపం వ్యక్తం చేసింది. ఆయన కుటంబాన్ని ఆదుకుంటామని ట్వీట్ చేసింది.
https://twitter.com/IAF_MCC/status/1471014776377511939?s=20