పంజాబ్ లో కొత్తపార్టీ ఆవిర్భవించనుంది. ముఖ్యమంత్రి పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చిన మాజీ సీఎం అమరీందర్ సింగ్ కొత్తపార్టీ పెట్టబోతున్నట్టు ప్రకటించారు. పంజాబ్ లోక్ కాంగ్రెస్ పేరుతో పార్టీని అధికారికంగా ఆవిష్కరిస్తామని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ రాష్ట్రంలోని మొత్తం 119 స్థానాల్లో పోటీ చేస్తుందనీ కెప్టెన్ ప్రకటించారు.