బీజేపీతో పొత్తుకు నా ఏకైక షరతు రైతుల ఆందోళనకు పరిష్కారం అని పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ అన్నారు. కొత్తపార్టీ ఏర్పాటు, పొత్తులపై ఆయన స్పష్టత ఇచ్చారు. ఇప్పటికే కేంద్ర హోంత్రిని కలిసి మాట్లాడానని..శనివారం బీజేపీ ప్రెసిడెంట్ ను కలుస్తున్నానని అన్నారు.
మూడు వివాదాస్పద వ్యవసాయ బిల్లులను రద్దు చేయడంతో పాటు ….రైతులు లేవనెత్తిన ఇతర సమస్యలపై చర్చిస్తున్నందున బీజేపీతో అధికారికంగా పొత్తుకు తాను మొగ్గు చూపుతున్నట్టు చెప్పారు. చాలా మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తనతో కలిసి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని కెప్టెన్ అన్నారు. పంజాబ్ ప్రజలెవరూ తన వెంట లేరన్న సీఎం చన్నీ వ్యాఖ్యల్నీ ఆయన ఖండించారు. రాష్ట్రంలో ఉన్నహిందువులు కూడా బీజేపీకి, తనకే మద్దతు ఇస్తున్నారన్నారు. 36 శాతం మంది హిందువులూ తమతోపాటే వస్తారని…రైతులనుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుందని ఆశిస్తున్నట్టు అమరీందర్ సింగ్ చెప్పారు.
బీజేపీ సిద్ధాంతం, హిందూవాదంపట్ల తాను అసౌకర్యంగా లేనని అన్నఅమరీందర్…రెండు దశాబ్దాలకు పైగా అకాళీదళ్ ఆ పార్టీతో కలిసి ఉందని..రాష్ట్రాన్నీ ఏలిందని గుర్తుచేశారు. అకాలీదళ్ సిక్కులపార్టీ అని…అయినా సరే బీజేపీతో వారికి సమస్యేం రాలేదని..అసలు పంజాబ్ లో మతతత్వం లేదనీ అన్నారు. ఎప్పుడూ ఏ మతపరమైన కార్యక్రమంలో తాను పాల్గొనలేదని..అన్ని మతాలు పంజాబ్ లో సమానమేనని అన్నారు.
పంజాబ్ లోక్ కాంగ్రెస్ పేరుతో కొత్త పార్టీ పెట్టిన అమరీందర్ సింగ్…రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 117 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పారు. తన పార్టీ, బీజేపీ ,థిండా అకాలీలు కలిసి పోటీచేస్తామన్నారు. అయితే సీట్ల సర్దుబాట్లపై ఇంకా చర్చించలేదని…కలిసి మాట్లాడుకుని నిర్ణయం తీసుకుంటామని అన్నారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రెగ్యులర్ గా తనకు టచ్ లోకి వస్తున్నారన్న అమరీందర్ … ఇప్పటికే 40మంది మాట్లాడారు. వారి పేర్లు, వివరాలు నేను చెప్పలేననీ దాటవేశారు. కాంగ్రెస్ మాత్రమే కాదు..అన్ని పార్టీల నాయకులూ నాతో వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.

file Photo