హోలీ సంబరాలకు ఈ సారి కూడా బ్రేకులు పడ్డాయి. గతేడాది కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా అనేక చోట్ల హోలీ సంబరాలు జరగలేదు. అయితే ఈ సారి ఫుల్ గ్రాండ్గా జరుపుకుందామనుకున్న వారికి ప్రభుత్వాలు బ్రేకులు వేశాయి. ఉన్న ఫలంగా గత కొద్ది రోజులుగా దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. సామూహిక వేడుకలపై ఆంక్షలు విధించాయి. ఈ క్రమంలోనే రాబోయే హోలీ వేడుకలపై నిషేధం విధించింది ఢిల్లీ సర్కార్. అయితే ఇప్పటికే గుజరాత్తో పాటు మరికొన్ని రాష్ట్రాలు కూడా హోలీ వేడుకలపై నిషేధం విధించింది. అయితే హోలికాదహనం మాత్రం కరోనా ఆంక్షలను పాటిస్తూ జరుపుకోవచ్చని అధికారులు తెలిపారు.కాగా, ఢిల్లీలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు ఎక్కువగా నమోదవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెప్తున్నారు.