బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ తో ఉన్న అన్ని ప్రకటనల్ని BYJU’s నిలిపేసింది. షారుఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో పట్టుబడడమే కారణం. షారుఖ్ 2017 నుంచి BYJU’s బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. అక్టోబర్ 3న ఓ లగ్జరీ క్రూయిజ్ లైనర్ పై దాడి చేసిన ఎన్సీబీ డ్రగ్స్ తో ఉన్న ఆర్యన్ సహా మరికొందరిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసింది. అప్పటినుంచే చాలామంది నెటిజన్లు షారుఖ్ ను ట్రోల్ చేస్తూ వచ్చారు. తన కొడుకు డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడితే ఆయన్ని అంబాసిడర్ గా ఎలా కొనసాగిస్తారంటూ BYJU’s నూ నిలదీశారు నెటిజన్లు. పద్ధతిగా విలువలు నేర్పిస్తూ తన కొడుకునే పెంచలేని వ్యక్తి ద్వారా లెర్నింగ్ యాప్ ను ఎలా ప్రమోట్ చేస్తారని తల్లిదండ్రులూ ప్రశ్నించారు. దీంతో షారుఖ్ ఖాన్ యాడ్స్ ను ఆపేసింది.