స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వేధింపులు తాళలేక పోతున్నానంటూ జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి తన పదవికి రాజీనామా చేశారు. కొంతకాలంగా తనను ఎలా ఇబ్బంది పెడుతున్నారో చెబుతూ మీడియా ఎదుటే కన్నీరుమున్నీరయ్యారు. ఎమ్మెల్యేను సంజయ్ కుమార్ దొర అని మాట్లాడిన శ్రావణి..తాను నరకం అనుభవిస్తున్నానన్నారు. ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో.. అవమానాలు ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చారు. కొద్దిరోజులుగా శ్రావణికి వ్యతిరేకంగా కొందరు కౌన్సిలర్లు పావులు కదుపుతున్నారు. 48 వార్డులు ఉన్న జగిత్యాల మున్సిపాలిటీలో.. 38 మంది అధికార బీఆర్ఎస్కు చెందినవారే. వీరిలో 27 మంది మున్సిపల్ చైర్పర్సన్ శ్రావణిపై తిరుగుబాటు చేస్తున్నారు. వారిని నడిపిస్తున్న వైస్ చైర్మన్ వెనక ఎమ్మెల్యే ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.