కర్నాటక హర్ష హత్యను నిరసిస్తూ తెలుగురాష్ట్రాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. హర్షకు ఆత్మశాంతి కలగాలంటూ నిర్మల్ జిల్లా సోనాలలో హిందూ వాహిని, బజరంగ్దళ్, వి.హెచ్.పి ఆధ్వర్యంలో కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. హైదరాబాద్ లోనూ గోరక్షకులపై హత్యాయత్నాన్ని ఖండించారు. హర్ష హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)