కశ్మీర్ అసిఫాకోసం కవితలు రాశారు, క్యాండిల్ ర్యాలీలు తీశారు…
తరువాత గీతను, మూడేళ్ల చిన్నారి ట్వింకిల్ శర్మను అతికిరాతకంగా హత్యాచారం చేస్తే వాళ్లు కనిపించలేదు…
మొన్నటికి మొన్న భైన్సా, భాగ్యనగరం చిన్నారులపై అత్యాచారం, హత్య… హక్కుల ఉద్యమకారుల కళ్లకు ఆననేలేదు…
నిన్న బెంగాల్లో నడిరోడ్డుపై యువతులపై గ్యాంగ్ రేప్…అదీ కనిపించలేదు…ఏమాత్రం కదిలించలేదు….
కఠువా చిన్నారి మైనార్టీ కావడమే కదా మీ అత్యద్భుత స్పందనకు కారణం…
ఓవర్గం మేధావులు, మీడియా కఠువా వ్యవహారంలో ఎన్నడూ లేని చొరవ, అత్యుత్సాహం ప్రదర్శించారు…చూశాం…
ఆసిఫా ఘటన తరువాత కొన్ని రోజులకే గీత, ఆ వెంటే ట్వింకిల్ శర్మ…నిన్నటికి నిన్న భైన్సాలో నాలుగేళ్ల చిన్నారిపైనా, భాగ్యనగరంలోనే మరో చిన్నారిపైనా లైంగికదాడి, హత్య జరిగితే ఆ మేధావి వర్గం నోరెత్తింది లేదు…
అంటే చావులోనూ కులం, మతమే చూస్తారు. వాళ్లకు గిట్టుబాటయ్యే శవాలమీదే రాజకీయం చేస్తారు, చిల్లర పేలాలు ఏరుకుంటారు…
అసిఫా హత్యాచార ఉదంతం దేశవ్యాప్త ఉద్యమానికి దారితీసిన నేపథ్యంలో ఎలాంటి నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయో అందరికీ తెలుసు. కేవలం స్థానికంగా ఉన్న హిందువులే లక్ష్యంగా కేసు విచారణ సాగింది.
అంతకుముందు అదే కశ్మీర్లో లక్షలాది మంది పండిట్లను తరిమేసినప్పుడు ఈ మేతావులు, మీడియా నోరుమెదపలేదు. వందలాదిమంది మహిళల మాన, ప్రాణాలు హరిస్తే ఎవరూ మాట్లాడలేదు. ఎక్కడా ఏ కేసూ రిజిస్టర్ కాలేదు. అప్పుడు వారంతా ప్రాణాలు అరచేతబట్టుకుని చెల్లాచెదురైపోయారు…
మొన్నటి కఠువా ఘటనను, ఇప్పుటి బెంగాల్ హింసల్ని నాటి కశ్మీర్ హింసతో పోల్చవచ్చు…
వందలకొద్దీ వీడియోల రూపంలో ఆధారాలున్నాయ్…నిన్ననే బీజేపీ చీఫ్ నడ్డా రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కృషిచేస్తామంటూ ఎన్నికైన ఎమ్మెల్యేలతో కోల్కతాలో ప్రతిజ్ఞ చేయించారు…
24 గంటలు తిరక్కుండానే సాక్షాత్తూ కేంద్రమంత్రిపై దాడి…
మీరు మాత్రమే శాంతి అంటే ఎలా నడ్డాసర్…ఎన్నాళ్లు పఠిస్తారు శాంతిమంత్రాన్ని…ఇంకెందరు బలికావాలి..
పండిట్లను తరిమేసిందెవరో తెల్సు…కఠువా వెనక కుట్రా తెలుసు…మొన్న భైన్సాలో, ఇప్పుడు బెంగాల్లో ఏం జరుగుతుందో చూస్తూనే ఉన్నాం…
ఈ దేశంలో ఎవరి హత్యనైనా ఖండించాల్సిందే…హత్యారాజకీయాలను సహించడానికి లేదెవరూ..
మతం ఏదైనా కావచ్చు దోషులకు శిక్షపడాల్సిందే. కశ్మీర్ పండిట్లు మొదలు..కేరళలో స్వయంసేవకుల హత్య..తాజా బెంగాల్ హత్యాకాండ వరకు జరుగుతున్న(ముఖ్యంగా హిందువులపై,మా మహిళలు,ఆడబిడ్డలపై) దాడులపై పునర్విచారణ, విచారణా చేపట్టాలి. ఈ దేశంలో మెజారిటీలవడమే హిందువులు చేసిన పాపమా! మైనారిటీలకేనా హక్కులు…ఇదెక్కడి న్యాయం?
అల్లర్లను అదుపుచేసే క్రమంలో దూకుడుగా వెళ్తే బద్నాం అవుతామని భయపడుతున్నారా…
లౌకుక్కులు, అమ్ముడుపోయిన మీడియా, చందాలకమ్మీల మొరుగుళ్లకు భయపడే వెనకడుగు వేస్తున్నారా…మరి ఎంతకాలం ఇలా అని మిమ్మల్ని గద్దెనెక్కించిన ప్రజలుగా ప్రశ్నిస్తున్నారు..
-దేవిక, జర్నలిస్ట్