కర్నాటకలో హిజాబ్ వివాదం ముదురుతోంది. అయితే ఇది కర్నాటకకు మాత్రమే పరిమితం కాబోదు. యావత్ భారత్ మీదా ప్రభావం చూపే అతిపెద్ద కుట్రపూరిత చర్య ఇది అని స్పష్టమవుతోంది. తాజాగా సోకాల్డ్ సెక్యులర్ పార్టీలు, లిబరల్స్ వ్యాఖ్యలు, ఓ వర్గం సమర్థింపులు చూస్తుంటే… చాలా సిగ్గుచేటుగా ఉన్నాయి…కొందరు మహిళల మాటలు కూడా. బికనీ వేసుకోవచ్చు, జీన్స్ వేసుకోవచ్చు అది మహిళల హక్కు అని ప్రియాంకవాద్రా ట్వీట్ చేసింది. అది స్కూల్, కాలేజీ అలాంటప్పుడు ఎవరు ఏదిపడితే అలా వేసుకురావచ్చా. విద్యాలయాలు కులమతాలకు, రాజకీయాలకు అతీతమైనవి కదా…అందరూ సమానమనే కదా యూనిఫాం పెట్టింది. అలాంటప్పుడు విద్యార్థినులు బికినీలు వేసుకుని వెళ్లచ్చు అని ఎలా అనగలరు.
అసలు బయట జీన్స్ , టీషర్ట్స్ ..సరే బికినీలు కూడా వేసుకుంటారేమో ప్రియాంక గాంధీ. కానీ ఎన్నికల ప్రచారసభలకు మాత్రం కేవలం చేనేత చీరలతోనే హాజరవుతారు. ఎందుకో మరి ఆమెనే చెప్పాలి. ఏదీ బికనీతో స్లీవ్ లెస్ టీషర్ట్ తోనే ఎన్నికల సభలో ఆమె ప్రసంగించగలరా..మరి చదువుకునే విద్యార్థులకు నిబంధన ఉండొద్దా. యూనిఫాం నిబంధననూ కాదనడం ఏంటీ..