దేశంలోని అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి గురువారం మొదటిదశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 11 జిల్లాల్లోని 58 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగాయి. ఉదయం 7:00 గంటల నుంచి సాయంత్రం 6:00 గంటల వరకు కొనసాగిన పోలింగ్లో 58.51 శాతం ఓటింగ్ నమోదైంది. యూపీలో సగటున 60-70 శాతం పోలింగ్ నమోదవుతుంది. ఈసారి మాత్రం తగ్గింది. మూడు ప్రధాన పార్టీలు అక్కడ అధికారం కోసం పోటీ పడుతున్నాయి.గత ఎన్నికల్లో మూప్పావు వంతు స్థానాలు గెలుచుకున్న బీజేపీ అధికారం సొంతం చేసుకుంది. ఈసారి కూడా గెలుపు తమదేనని యోగీ నేతృత్వంలోని ఆపార్టీ అశాభావం వ్యక్తం చేస్తోంది. ఇక ఈసారి మార్పు ఖాయమని అధికారం తమదేననే ధీమాలో అఖిలేష్ నాయకత్వంలోని సమాజ్ వాదీ పార్టీ ఉండగా… ఇక పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న బీఎస్పీ సైతం ఆ రెండుపార్టీలకు గట్టిపోటీనే ఇస్తోంది.