కర్ణాటక మాండ్యా జిల్లాలోని శ్రీరంగపట్నంలో వీహెచ్పీ, భజరంగ్దళ్ ‘శ్రీరంగపట్నం చలో’ ర్యాలీకి ముందు CRPC చట్టంలోని సెక్షన్ 144 కింద నిషేధాజ్ఞలు విధించారు. కార్యక్రమం నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా పట్టణంలో 4 చెక్పోస్టులను ఏర్పాటు చేసి భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
https://twitter.com/ANI/status/1532914070071824385?s=20&t=-nU1iLF3Es0U2WCrUnch0g
వీహెచ్పీ, బజరంగ్ దళ్ సభ్యులు శ్రీరంగపట్నంలోని జామియా మసీదు వైపు కవాతు చేయాలని.. ఈ రోజు మసీదు లోపల హిందూ మతపరమైన పూజలు చేయాలని పిలుపునిచ్చారు. 1782లో హనుమాన్ ఆలయాన్ని కూల్చివేసి జామియా మసీదును టిప్పు సుల్తాన్ నిర్మించాడని హిందూ సంస్థలు తెలిపాయి.
ప్రతి సంస్థకు తన వాదనలను శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా సమర్పించే హక్కు ఉందని.. అయితే చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకోవడానికి అనుమతించమని కర్ణాటక హోం మంత్రి ఆరగ జ్ఞానేంద్ర జూన్ 3న చెప్పారు. వీహెచ్పీ పిలుపునిచ్చిన ‘శ్రీరంగపట్నం చలో’ డ్రైవ్ సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణకు అన్ని ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా పోలీసులను ఆదేశించినట్లు ఆయన తెలిపారు.
https://twitter.com/ANI/status/1532720420444459009?s=20&t=7HQxfdVLp5cAAd_FEAB5MQ
తమ అభ్యర్థనపై స్పందించడంలో విఫలమైన జిల్లా అధికారుల నుంచి మార్చ్కు అనుమతి కోరినట్లు వీహెచ్పీ, బజరంగ్ దళ్ సభ్యులు తెలిపారు. అయితే మసీదును రక్షించాలని మసీదు అధికారులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
జూన్ 3వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 24 గంటల పాటు 144 సెక్షన్ విధించారు. శనివారం మార్కెట్ ఏర్పాటును వాయిదా వేస్తున్నామని, ఈరోజు శ్రీరంగపట్నం పరిధిలోని 5 కి.మీ పరిధిలో మద్యం అమ్మకాలను నిషేధించినట్లు మాండ్య డిప్యూటీ కమిషనర్ ఎస్ అశ్వతి తెలిపారు. మసీదు రహదారిని మూసివేశామని.. ఈ రోజు ప్రజలను మసీదులోకి అనుమతించబోమని ఆయన తెలిపారు. సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశామని.. అనుమానాస్పద కదలికలపై ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు.
https://twitter.com/ANI/status/1532918099972071424?s=20&t=t7xabFfjoFt03Z6N3_v2ow
అదే సమయంలో జిల్లా యంత్రాంగం నిషేధాజ్ఞలు విధించిందని.. ఈరోజు శ్రీరంగపట్నం పట్టణ పంచాయతీ పరిధిలో ర్యాలీ, ఊరేగింపు లేదా నిరసనలకు అనుమతి లేదని మండ్య ఎస్పీ ధృవీకరించారు. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పట్టణంలో లేదా చుట్టుపక్కల తగిన బందోబస్తు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు.
గత వారం ‘నరేంద్ర మోదీ విచార్ మంచ్’ (NMVM) అనే బృందం మాండ్యా డిప్యూటీ కమిషనర్ను సంప్రదించి, మసీదు-ఎ-ఆలా ను ‘మూడాల బాగిలు ఆంజనేయ స్వామి ఆలయం’ అని, గుడిని కూల్చి మసీదు కట్టినట్టు పేర్కొన్నారని సమాచారం. మసీదు లోపల హనుమంతుడికి ప్రార్థనలు చేసేందుకు అనుమతించాలని మాండ్యా డిప్యూటీ కమిషనర్ను అభ్యర్థించారు.