హింసను అదుపు చేయడంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్ర పోలీసులు ఘోరంగా విఫలమయ్యారు. అంతేకాకుండా, పరిస్థితిని నియంత్రించడానికి వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన శిక్షణ పొందిన సాయుధ కేంద్ర బలగాలను కూడా ఉపయోగించలేదు’ అని కలకత్తా హై కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి తీవ్రంగా వ్యాఖ్యానించారు.
కేంద్ర బలగాలను నిర్వహించడానికి కేంద్రం నియమించిన ఐజి బిఎస్ఎఫ్ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ అశోక్ చక్రబర్తి ఒక నివేదికను దాఖలు చేశారు. రాష్ట్ర పోలీసులు అవసరమైన ప్రాంతాల్లో మోహరింపు కోసం కేంద్ర బలగాలను ఉపయోగించుకోకుండా వారిని వేచి ఉండేటట్లు ఉంచారని ఆ నివేదికలో, IG BSF ఆరోపించారు.
ఆ “ఆరోపణ నిజమే. శిక్షణ పొందిన కేంద్ర బలగాలను కలవరపరిచే ప్రాంతాలకు పంపలేదు’’ అని ప్రధాన న్యాయమూర్తి కూడా వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది కూడా దానిని అంగీకరించారు.
తన 80 పేజీల నివేదికలో, IG BSF చెదిరిన ప్రాంతాల జాబితా కోసం రాష్ట్ర పోలీసులకు అనేక ఇమెయిల్లు పంపామని, అయితే రాష్ట్ర పోలీసు వ్యవస్థ నుండి ఎటువంటి స్పందన రాలేదన్నారు.
“ప్రిసైడింగ్ అధికారులు, పోలీసులు మరియు సామాన్య ప్రజలపై దాడులు జరుగుతున్న సమయంలో, పోలీసులు కేంద్ర బలగాల సహాయం తీసుకోవడంలో విఫలమయ్యారు. ఎందుకు కేంద్ర బలగాలను తీసుకురావాలని అనుకున్నామో ఆ ఉద్దేశ్యం ఫలించలేదు’ అని కలకత్తా హై కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి అన్నారు.
న్యాయవాదుల వాదనలు విని, ఐజి బిఎస్ఎఫ్ నివేదికను పరిశీలించిన తర్వాత, ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత కేంద్ర బలగాలు మరో 10 రోజుల పాటు బెంగాల్లో ఉంటాయని బెంచ్ తెలిపింది.
ఎన్నికల ప్రక్రియ ఎప్పుడు పూర్తవుతుందో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటిస్తుంది అని చెప్పింది.
పోల్ ప్యానెల్పై ఫిర్యాదుల వివరాలతో అఫిడవిట్లు దాఖలు చేయాలని పిటిషనర్లను చీఫ్ జస్టిస్ కోరారు.
స్థానిక ఎన్నికలు అయిపోయినా, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి దృష్ట్యా కేంద్ర బలగాలు ఇంకో పది రోజులు రాష్ట్రంలో ఉండాలి అని కలకత్తా హై కోర్ట్ చెప్పింది.
ఎన్నికల నిర్వహణ ఇంత హింస, రిగ్గింగ్, హత్యలతో
ఏ బిజెపి రాష్ట్రంలో జరిగి, కోర్టు ఇటువంటి వ్యాఖ్యలు చేసి ఉంటే ‘సెక్యూలర్ ముఠా’ ఎంత గగ్గోలు పెట్టేదో ఊహించండి. ఆ రాష్ట్ర ముఖ్య మంత్రి రాజీనామా కోరి గోల గోల చేసి వుండేవారు ఈ సెక్యూలర్ ముఠా.
కానీ ఈ దారుణాలు జరిగింది సెక్యూలర్ ముసుగు వేసుకున్న మమత రాజ్యంలో కాబట్టి ఒక్క వ్యతిరేక మైన వ్యాఖ్య చేయకుండా మూడు కోతుల్లా ఉండిపోయారు ఈ సెక్యూలర్ ముఠా సభ్యులు అంతా.
అందుకే అంటాను…
కుటుంబ పాలనకు, అవినీతి దోపిడీకి, హింసాయుత పాలనకు సెక్యూలర్ కవచం బాగా ఉపయోగ పడుతుంది.
…..చాడా శాస్త్రి….