పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్కర్కు బదులుగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీని రాష్ట్రంలో అన్ని విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్గా నియమించే బిల్లును ప్రవేశపెట్టాలని పశ్చిమ బెంగాల్ కేబినెట్ నిర్ణయించింది. గవర్నర్ ధంఖర్, బెనర్జీ మధ్య తరచూ మాటల యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. చట్ట సవరణ కోసం దీనిని అసెంబ్లీకి తీసుకెళ్తామని రాష్ట్ర మంత్రి బ్రత్యా బసు తెలిపారు.