తెలంగాణలో కేసులు ఉధృతమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర కేబినెట్ రేపు సమావేశం అవుతోంది. కోవిడ్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలతో పాటు లాక్ డౌన్ పైనా మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. లాక్ డౌన్ విధిస్తే కనుక పర్యవసానాలపైనా చర్చించనున్నారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్లో జరిగే కేబినెట్ భేటీలో ఇంకా పలు అంశాలపైనా చర్చించనున్నారు., ముఖ్యంగా ధాన్యం కొనుగోళ్లు,ఇతర వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కారాలపైనా కేబినేట్ చర్చించనుంది.