తెలంగాణ మంత్రి వర్గాన్ని విస్తరించే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్నిహిత మిత్రులతో కలిసి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ అధిష్టానం పెద్దల్ని విడివిడిగా కలుసుకుంటున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఆశీస్సులు రేవంత్ రెడ్డి తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ సంఘటన ప్రధాన కార్యదర్శిగా పేర్కొన్నారు కేసీ వేణుగోపాల్ తో రేవంత్ రెడ్డి టీం ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ భేటీలో మంత్రివర్గ విస్తరణ మీద చర్చ జరిగినట్టు తెలుస్తోంది.
తెలంగాణలో కాంగ్రెస్ నుంచి మంత్రి పదవులు ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే కనిపిస్తుంది. ఇప్పటికీ సిఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం బట్టి లతో కలిపి 12 మందితో రాష్ట్ర కేబినెట్ పనిచేస్తోంది. మంత్రివర్గంలో ఇంకా 6 బెర్తులు ఖాళీ ఉన్నాయి.
ఇప్పటి వరకు నల్గొండ, ఖమ్మం, మెదక్,వరంగల్, మహబూబ్ నగర్, కరీంనగర్ జిల్లాల నుండి మాత్రమే మంత్రి వర్గంలో ప్రాతినిధ్యం కనిపిస్తోంది. కీలకమైన ఉత్తర తెలంగాణ ప్రాతినిధ్యం తక్కువగా ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాల నుంచి బెర్తులు ఆశిస్తున్నారు. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేలు గెలుపు సాధించలేదు దీంతో జంట నగరాలకు మంత్రి పదవి ఇవ్వలేకపోయారు.
మంత్రి పదవి ఆశిస్తున్న వారి పేర్లు చాలానే కనిపిస్తున్నాయి.
నల్గొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బాలు నాయక్ ఉన్నారు. రంగారెడ్డి జిల్లా నుండి మల్ రెడ్ది రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి ఆశిస్తున్నారు. నిజామాబాదు జిల్లా నుండి సుదర్శన్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు.
అదిలాబాదు జిల్లా నుండి వివేక్ బ్రదర్స్ లో ఒకరు, ప్రేమ్ సాగర్ రావు క్యూ లో ఉన్నారు.
హైదరాబాద్ జంట నగరాల నుంచి పోటీ ఎక్కువగానే ఉంది. హైదరాబాదు జిల్లా నుండి ఎమ్మెల్సీ బలమూరి వెంకట్ కోరుకొంటున్నారు.
ఇటీవల బిఅర్ఎస్ పార్టి నుండి కాంగ్రెస్ పార్టీ లో చేరిన దానం నాగేందర్ పేరును కూడా పరిశీలిస్తున్నారు.
లోక్సభ ఎన్నికల ప్రచారం సమయంలో ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వారికి మంత్రి పదవి ఇస్తామని సిఎం రేవంత్ రెడ్డి హామి ఇచ్చారు.
హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాలో బిఅర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకొని వారిలో కొంతమందికి మంత్రి పదవులు ఇచ్చే అవకాశం కూడా లేకపోలేదు. తలసాని శ్రీనివాస్ యాదవ్,ప్రకాష్ గౌడ్, కెపి.వివేకానంద గౌడ్ ల పేర్లు కూడా ప్రచారంలో ఉన్నవి.
మొత్తం మీద రేవంత్ రెడ్డి దగ్గర కొన్ని పేర్లతో ఒక జాబితా ఉందని పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ జాబితా కి హై కమాండ్ ఆమోద ముద్ర వేస్తే మంత్రివర్గ విస్తరణ జరగవచ్చు.
అయితే ప్రస్తుత మంత్రి వర్గంలో యాదవ, ముదిరాజ్ కమ్యూనిటీ నుండి ప్రాతినిధ్యం లేదు…
మరోవైపు లంబాడా నుండి కూడా ప్రాతినిధ్యం లేదు…
జులై రెండో వారం లేదా మూడవ వారంలో అసెంబ్లీ సమావేశాలు ఉండే అవకాశాలు ఉన్నాయి…
ఈ సమావేశాలకు ముందే పూర్తి స్దాయీ మంత్రి వర్గ కూర్పును పూర్తి చేయాలని సిఎం రేవంత్ రెడ్డి ఉద్దేశం…
ఇప్పటికే పాలనాపరమైన అన్ని రకాల అధికారుల బదిలీలను చేపట్టిన ప్రభుత్వం