ప్రభుత్వ పెన్షన్ విధానంపై బిల్లు రూపకల్పనకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఏపీ గ్యారెంటీడ్ పెన్షన్ బిల్లు 2023 పేరుతో కొత్త పెన్షన్ విధానం అమలుకు నిర్ణయించింది. సీపీఎస్ ఉద్యోగుల కోసం సీపీఎస్ స్థానంలో ఏపీ జీపీఎస్ బిల్లును తీసుకొచ్చింది జగన్ సర్కార్.
కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకూ మంత్రివర్గం ఆమోదం తెలిపింది.12వ పీఆర్సీ ఏర్పాటుకూ అంగీకారం తెలిపింది.ఇక జగనన్న ‘అమ్మ ఒడి’ పథకాన్ని జూన్ 28నుంచి అమలుచేయాలని కేబినెట్ నిర్ణయించింది.18.58 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు స్మార్ట్ మీటర్ల బిగింపునకు రూ. 6,888 కోట్ల వ్యయం చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్ నెట్ కోసం రూ. 445 కోట్ల రుణాల కోసం ఏపీఎఫ్ఎస్ఎల్ కు కెబినెట్ అనుమతిచ్చింది.