ప్రధాని మోదీ ప్రకటించినట్టుగా కొత్తసాగు చట్టాలను రద్దు చేసేందుకు ఉద్దేశించిన బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. . నవంబరు 29 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఏడాదిగా పలువురు రైతులు డిమాండ్ చేస్తూ ఆందోళనలకు దిగిన సంగతి తెలిసిందే. నిరసనల నేపథ్యంలో చట్టాలను రద్దు చేస్తున్నట్లు ఈనెల 19న మోదీ ప్రకటించారు. ఈ విషయంలో రైతులకు నచ్చజెప్పడంతో తాము విఫలమయ్యామంటూ దేశ ప్రజలను మోదీ క్షమాపణ కోరారు. కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) కోసం నూతన నిబంధనావళిని రూపొందించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు.