ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది సహా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లందరికీ అంటే మొత్తం 9,21,037 మందికి 30 శాతం పీఆర్సీని కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈమేరకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
పెంచిన పీఆర్సీని జూన్ నుంచి అమలు చేసి చెల్లించాలని నిర్ణయించింది.
నోషనల్ బెనిఫిట్ ను 1.7.2018 నుంచి., మానిటరీ బెనిఫిట్ ను గతేడాది ఏప్రిల్ 1నుంచి, క్యాష్ బెనిఫిట్ ను ఈ ఏడాది ఏప్రిల్ 1నుంచి అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులను ఆదేశించింది.
పెన్షనర్లకు గతేడాది ఏప్రిల్ ఒకటోతేదీ నుంచి…ఈ ఏడాది మే 31వరకు చెల్లించాల్సిన ఏరియర్స్ ను 36 వాయిదాల్లో చెల్లించాలని కేబినెట్ నిర్ణయించింది. కేజీబీవీ కాంట్రాక్టు ఉద్యోగులకు 180 రోజుల ప్రసూతి సెలవును మంజూరు చేయాలని నిర్ణయించింది.