హైదరాబాద్ లో ఆర్టీసీ బస్సు సర్వీసులు ఉదయం 5 నుంచి రాత్రి 9 గంటల మధ్య మాత్రమే నడుస్తాయని ఆర్టీసీ ప్రకటించింది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే బస్సులను రాత్రి 9 గంటల తరువాత కూడా సంబంధిత డిపోలకు అనుమతిస్తున్నారు. ఏప్రిల్ 30 వరకు నగరంలో రాత్రి 9 గంటల తరువాత అన్ని సర్వీసులు రద్దవుతాయని అధికారులు తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్లో పరిధిలో ఆర్టీసీ 2,800 బస్సులను నడుపుతోంది.