పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీ నివాసంలో నిన్న రాత్రి చోరీ జరిగింది. మంత్రి నివాసంలోకి తాళం పగులగొట్టి దొంగ చొరబడ్డాడు. ఛటర్జీ నివాసం నుంచి అనేక వస్తువులను పెద్ద పెద్ద సంచులలో దొంగ తీసుకున్నాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అయితే దొంగను ఈడీ చేస్తోన్న మరొక దాడిగా భావించామని వారు అన్నారు.
ఛటర్జీ సన్నిహితురాలు అర్పితా ముఖర్జీకి చెందిన రెండో అపార్ట్మెంట్లో మరో రూ.28.90 కోట్ల నగదు, 5 కేజీలకు పైగా బంగారం, పలు పత్రాలను ఈడీ నిన్న స్వాధీనం చేసుకుంది. గతంలో ముఖర్జీ ఇంట్లో రూ.21.90 కోట్ల నగదు, రూ.56 లక్షల విదేశీ కరెన్సీ, రూ.76 లక్షల విలువైన బంగారాన్ని ఏజెన్సీ స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.