బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కు కోర్టు బెయిల్ నిరాకరించింది. బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన కరీంనగర్ జిల్లా సెషన్స్ కోర్టు …ఆయనకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయన్ని కరీంనగర్ జైలుకు తరలించారు. 317 జీవోను సవరించాలని డిమాండ్ చేస్తూ ఎంపీ క్యాంప్ కార్యాలయంలో సంజయ్ తలపెట్టిన జాగరణ దీక్షను పోలీసులు భగ్నం చేసి అరెస్ట్ చేశారు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించడంతో పాటు…పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ టూటౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. సంజయ్ సహా మొత్తం 12 మందిపై కేసులు నమోదయ్యాయి. ఉదయం వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరు పర్చగా కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది.