ప్రధాని నరేంద్రమోదీ పుట్టినరోజు సందర్భంగా డిల్లీకి చెందిన ఓ రెస్టారెంట్ భోజన ప్రియులకు సూపర్ ఆఫర్ ఇచ్చింది. మోదీ జన్మదినం సందర్భంగా ప్రత్యేకమైన థాలీ సిద్ధం చేస్తున్నట్టు ప్రకటించింది. దానికి 56 ఇంచెస్ మోదీజీ గా పేరు పెట్టింది. అసలైతే ఆ థాలీని మోదీకి బహుమతిగాఇవ్వాలని నిర్ణయించారు. అందుకోసం ఆయన్ని ఆహ్వానించారు కూడా. కానీ భద్రతాపరమైన కారణాలతో అది కుదరలేదు. అందుకే దాన్ని అభిమానులకు అందించాలనుకున్నట్టు రెస్టారెండ్ ఓనర్ సుమిత్ తెలిపారు. అయితే ఊరకే మాత్రం కాదు.. దాన్ని 40 నిమిషాల్లో పూర్తిగా ఆరగించిన వారికి 8.5 లక్షల ప్రైజ్ మనీ ఇవ్వాలనుకుంటున్న తెలిపారు. ఆ స్పెషల్ థాలీలో 56 రకాలుంటాయి. అందులోనూ వెజ్, నాన్ వెజ్ రెండూ ఎంచుకోవచ్చు. ఈ నెల 17 నుంచి 26వ తేదీ వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని, ఒక్కరైనా, జంటలుగా అయినా రావొచ్చని వివరించారు. ఇక లక్కీడ్రాలో గెలిచేవారికి కేదార్ నాథ్ ఉచిత ట్రిప్ కూడా.
అన్నట్టు ఆ రెస్టారెంట్ ఎక్కడుందో తెలుసా..కన్నాట్ ప్లేస్ లో ఉన్న దానిపేరు ఆర్డర్ 2.0. ట్రై చేయండి మరి.