బుల్ రంకెలు.. కొత్త పుంతలు!!
కేంద్ర బడ్జెట్ తర్వాత షేర్ మార్కెట్ రాకెట్ లా దూసుకుపోవడం అరుదైన విషయం. మదుపర్లకు నచ్చకపోతే సూచీలు ధబేల్ మని పడిపోతాయి. కానీ సోమవారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత సెన్సెక్స్ ఆకాశమే హద్దు అన్నట్టు ఎగసింది. అంతా ఇంతా కాదు, ఏకంగా 5 శాతం లబ్ధి పొందింది.
దీనికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన గ్రాఫిక్ ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్నది. దాని ప్రకారం, ప్రణబ్ ముఖర్జీ 2010లో బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత సెన్సెక్స్ 1.08 శాతం లాభపడింది. 2011లో 0.69 లాభపడింది. 2012లో 1.19 శాతం నష్టపోయింది.
పి.చిదంబరం 2013లో బడ్జెట్ తెచ్చిన తర్వాత సెన్సెక్స్ 1.52 శాతం, 2014లో 0.28 శాతం నష్టపోయింది. అరుణ్ జైట్లీ బడ్జెట్ నాలుగు సార్లు బడ్జెట్ ప్రవేశ పెడితే సెన్సెక్స్ రెండు సార్లు లాభపడగా రెండు సార్లు నష్టపోయింది. 2019లో పియూష్ గోయల్ బడ్జెట్ చదవగానే 0.59 శాతం లాభపడింది.
నిర్మలా సీతారామన్ 2020లో బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత సెన్సెక్స్ ఢమాల్ మన్నది. 2.43 శాతం నష్టపోయింది. ఈసారి మాత్రం 5 శాతం సెన్సెక్స్ లాభపడి షేర్ మార్కెట్లు కళకళలాడాయి. కరోనా కష్టకాలం తర్వాత ఆర్థిక వ్యవస్థ పుంజుకునే చేయడంలో మోడీ ప్రభుత్వం సఫలమైందని చెప్పడానికి ఇది సూచిక. అత్యంత సంపన్న దేశాలు కూడా కరోనా దెబ్బకు గింగిరాలు తిరిగాయి. ఇప్పటికీ తేరుకోలేక పోతున్నాయి. కానీ స్వయం సమృద్ధ భారత్ వేగంగా నిలదొక్కుకుంది. దటీజ్ మోడీజీ.