2023-24 ఆర్థిక సంవత్సరం బడ్దెట్ కోసం కేంద్రం కసరత్తు చేస్తోంది. ప్రధాని మోదీ, ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ ఈ మేరకు ఆర్థికవేత్తలు, వివిధ రంగాల నిపుణులతో సమావేశం అయ్యారు. నీతిఆయోగ్ కార్యాలయంలో చర్చలు జరిపారు.
వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఇదే ఈ ప్రభుత్వ చివరి బడ్జెట్. ఫిబ్రవరి 1న పార్లమెంటుకు సమర్పిస్తారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ వృద్ధి రేటు 7 శాతానికి పరిమితమవుతుందని గత వారం విడుదలైన నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ నివేదిక అంచనా వేసింది. దేశ ఆర్థికాభివృద్ధి రేటు 7 శాతానికి పరిమితమయ్యే అవకాశం ఉన్నట్లు అంచనాలు వెలువడుతున్న నేపథ్యంలో వృద్ధిని పెంచేందుకు తీసుకోవలసిన చర్యలపై కూడా మోదీ, నిర్మల సీతారామన్ చర్చిస్తున్నారు.