2023-24 ఆర్థిక బడ్జెట్ ను రాష్ట్రప్రభుత్వం ఫిబ్రవరి 6న ప్రవేశపెట్టనుంది. ఆరోజు శాసనసభలో ఆర్థికమంత్రి హరీష్ రావు, మండలిలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెడతారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఇక ఫిబ్రవరి 3న ఉభయసభలనుద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగించనున్నారు. అసలైతే మూడోతేదీనే ఉభయసభల సమావేశం నిర్వహించి అదే రోజు బడ్జెట్ ప్రవేశపెట్టాలని కేసీఆర్ సర్కారు నిర్ణయించింది. అసెంబ్లీ ప్రోరోగ్ కాలేదన్న కారణంతో గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ ప్రవేశపెట్టాలనుకుంది ప్రభుత్వం. అనంతరం నిబంధనల మేరకు బడ్జెట్ ను గవర్నర్ ఆమోదంకోసం పంపింది. గవర్నర్ ఆమోదం తెలపకపోవడంతో ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్ట్ జోక్యంతో రాష్ట్ర అడ్వోకేట్ జనరల్, రాజ్ భవన్ న్యాయవాది మధ్య అవగాహన మేరకు ప్రభుత్వం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ ను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. తరువాత ప్రత్యేకంగా సమావేశమైన మంత్రులు, అధికారులు గవర్నర్ ను ఆహ్వానించాలని నిర్ణయించారు.