బడ్జెట్2021.. పెరిగేవి ఏంటో.. తగ్గేవి ఏంటో ఓ లుక్ వేద్దాం..!!
కరోనా మహమ్మారితో యావత్ ప్రపంచం అస్తవ్యస్తమైన సంగతి తెలిసిందే. మన దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా ఈ కరోనా వైరస్ తీవ్ర ప్రభావాన్ని చూపించింది. ఈ పరిస్థితుల్లోనే ఏప్రిల్ 1వ తేదీ
నుంచి ప్రారంభమయ్యే నూతన ఆర్థిక సంవత్సరానికి గానూ.. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సారి డిజిటల్
పద్ధతి (ట్యాబ్)లో.. బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలమ్మ.. గంటా 51 నిమిషాల పాటు ప్రసంగించారు. ఆర్థిక బడ్జెట్ వివరాల ప్రకారం వేటి ధరలు పెరుగుతున్నాయి..? వేటి
ధరలు తగ్గుతున్నాయి చూద్దాం..
దిగుమతి చేసుకున్న మొబైల్ ఫోన్స్, ఛార్జర్స్ రేట్లు పెరగనున్నాయి. ఆయా వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ 5 నుంచి 10 శాతం వరకు పెంచుతున్నట్టు నిర్మలా సీతారామన్
ప్రకటించారు. ఫోన్లు, ఛార్జర్ల ధర 1 నుంచి 2 శాతం వరకూ పెరగవచ్చని ఆర్ధిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఛార్జర్లపై సుంకాన్ని 15
నుంచి 30 శాతానికి.. మదర్బోర్డ్లపై 10 నుంచి 20 శాతం సుంకాన్ని పెంచారు. మొబైల్ ఫోన్లకు ఇస్తున్న 10 శాతం సర్వీస్ వెల్ఫేర్ సెస్ మినహాయింపును కూడా ఈసారి రద్దు
చేశారు.
ఇక బంగారం, వెండి ధరలు దిగిరానున్నాయి. అదే విధంగా రాగిపై పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. వ్యవసాయ ఉత్సత్తుల ధరలు కూడా తగ్గనున్నాయి.
ఐరన్, స్టీల్, నైలాన్ క్లాత్,షూస్(లెదర్ కాకుండా) ధరలు తగ్గనున్నాయి.
ధరలు పెరిగేవి..
– ఎలక్ట్రానిక్ వస్తువులు (రిఫ్రిజిరేటర్, వాషింగ్ మిషన్,ఏసీ)
– మొబైల్ ఫోన్స్( దిగుమతి సుంకం 2.5 పెంపు)
-జెమ్స్( రత్నాలు)
– పెట్రోల్, డీజిల్
– ఇంపోర్ట్ చేసుకునే కాటన్ దుస్తులు, వంట నూనె, ఆటో స్పేర్ పార్ట్స్
– సోలార్ ఇన్వర్టర్స్
– కార్లు, వాటి విడి భాగాలు
– లెదర్ ప్రొడక్ట్స్
– ఆల్కహాలిక్ బెవెరేజెస్
– క్రూడ్ పామాయిల్, క్రూడ్ సోయాబీన్, సన్ఫ్లవర్ ఆయిల్
– బొగ్గు, లిగ్నైట్, పిట్
– యూరియా, ఎరువులు
– బఠాణీలు
– పప్పులు
ధరలు తగ్గేవి..
– ఐరన్
-స్టీల్
-నైలాన్ క్లాత్
-కాపర్ వస్తువులు
-ఇన్సూరెన్స్
-షూస్
-వెండి
-బంగారం
– నాప్తా(హైడ్రోకార్బన్ లిక్విడ్ మిక్చర్)
– వ్యవసాయ ఉత్పత్తులు