అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. అసోంలో బీజేపీ బూత్ అధ్యక్షుడి దారణహత్య కలకలం రేపుతోంది. శుక్రవారం రాత్రి తిన్ సుకియా జిల్లాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. బూహిదిహింగ్ గ్రామ పంచాయితీకి చెందిన బీజేపీ బూత్ అధ్యక్షుడు దేబానంద్ గొగోయ్పై దుండగులు కత్తులతో దాడికి పాల్పడ్డారు. ఆయన వయస్సు 48 సంవత్సరాలు. దేబానంద్ హత్యకు గురికావడంతో స్థానికంగా టెన్షన్ వాతావరణం నెలకొంది. అసోం సీఎం సర్భానంద సోనోవాల్ ఖండించారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలంటూ డీజేపీ ఆదేశాలు జారీ చేశారు. కాగా, ఘటనకు సంబంధించి జయచంద్ర గగోయ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాదు.. నిందితుడి నుంచి ఓ డాగర్ను స్వాధీనం చేసుకున్నారు.