కేంద్రంలో బీజేపీని నిలువరించే సత్తా బీఆర్ఎస్ కే ఉందని… సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. భారత రాష్ట్రసమితిని స్వాగతిస్తున్నట్టు చెప్పారు. తాజాగా హిమాచల్ ప్రదేశ్ లో ఓటమితో ఆ పార్టీ పతనం మొదలైందన్నారు. అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిస్తే బీజేపీని ఓడించవచ్చని జోస్యం చెప్పారు.ఇక తెలంగాణలో అధికారంలోకి వస్తామని బీజేపీ కలలు కంటోందని కానీ డబుల్ డిజిట్ కూడా రాదని ఆయన అన్నారు. టీఆర్ఎస్ తో పొత్తు కొనసాగుతుందని…అయితే ప్రజాసమస్యలపైనా పోరాటం చేస్తామనీ అన్నారు కూనంనేని.