తాను బీజేపీని వీడేది లేదని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ తనను బయటకు పంపితే తనను దగ్గరతీసి ధైర్యం ఇచ్చి, గౌరవించిన పార్టీ బీజేపీ అని ఆయన అన్నారు.
ఈటల పార్టీ మారుతున్నారని…రేవంత్ ఈటలను ఆహ్వానించారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహా ఎవరూ బీజేపీని వీడబోవడం లేదన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లనుంచే నేతలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. తాను క్షణికావేశంతో కాక ఆలోచించి బీజేపీలో చేరారని… ఎవరి చిల్లరమాటలతో స్పందించాల్సిన అవసరం, బదులివ్వాల్సిన అవసరం తనకు లేదన్నారు.