భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ సభను ఖమ్మంలో నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈనెల 18న జరిగే కార్యక్రమానికి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించారు. ఢిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, అఖిలేష్ యాదవ్ లు వచ్చేందుకు అంగీకారం తెలిపారని.. పినరయ్ విజయన్ ఇంకా చెప్పలేదని పార్టీ వర్గాలంటున్నాయి. అదే రోజు ఖమ్మం కలెక్టరేట్ ను ప్రారంభించి..అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన ప్రసంగిస్తారు. సీఎం ఆదేశాలతో అందుకు తగ్గట్టు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.