బిజెపి మీద కోపంతో మెయిన్ మీడియా, నీతి జాతి లేని మేధావులూ పూర్తి మౌనం వహించినా సోషల్ మీడియా పుణ్యం వల్ల బెంగాల్ లో ఎన్నికల అనంతరం జరుగుతున్న భయంకరమైన హింసాత్మక సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. బెదిరింపులు, లూటీలూ, దహనాలు, మానభంగాలు. ఇలా ఒకటేమిటి దేశ విభజన అప్పుడు జరిగిన అకృత్యాలన్ని బెంగాల్ లో ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుండి రోజూ జరుగుతున్నాయి.
యూపీ హత్రస్ లో ఒకే ఒక్క అనుమానాస్పద రేప్ సంఘటనపై విపరీతంగా స్పందించిన ప్రతిపక్షాలు మూర్ఖ మేధావులు రోజుకో మాన భంగం వార్త బెంగాల్ నుండి వస్తున్నా అన్ని మూసుకు కూర్చున్నారు.
ఈ హింసపై బెంగాల్ ప్రభుత్వం పోలీసులు పూర్తి ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. దీనిపై కలకత్తా హై కోర్ట్ లోనూ సుప్రీంకోర్టు లోనూ పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు అయ్యాయి. సుప్రీంకోర్టు మొదట్లో మౌనం వహించినా కలకత్తా హై కోర్ట్ మే నెలలోనే విచారణ చేపట్టి ప్రభుత్వాన్ని హెచ్చరించింది.
అయినా పరిస్థితులు మెరుగు పడకపోవడంతో 5గురు సభ్యుల కలకత్తా హై కోర్ట్ బెంచ్ మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించింది.
ఈ హింసపై హై కోర్ట్ లో కేసు నడుస్తున్న సమయంలో కూడా హై కోర్ట్ కి ఇచ్చిన హామీకి విరుద్ధంగా హింస జరుగుతూ ఉండడం, వాటిని అరికట్టడానికి ప్రభుత్వం తగు చర్యలు తీసుకోకపోవడం పై ప్రభుత్వాన్ని తీవ్రంగా ఆక్షేపించింది…
“రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడుతూ ప్రజలు ప్రశాంతంగా జీవించేలా ధైర్యం, నమ్మకం కలిగేలా చూడవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది. కానీ కేసు మా ముందు పెండింగ్ లో ఉన్నా తగు గట్టి రక్షణ చర్యలు తీసుకున్నట్లు కనిపించడం లేదు” అని హై కోర్ట్ బెంచ్ వ్యాఖ్యానించింది.
జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆధ్వర్యంలో ముగ్గురు సభ్యుల కమిటీ ని ఏర్పాటు చేయమని, ఇప్పటి వరకు జరిగిన అన్ని హింసాత్మక ఘటనలు, ఇక ముందు జరిగే ఇటువంటి సంఘటనలు ఈ కమిటీ విచారించి ఒక సమగ్రమైన నివేదిక మాకు సమర్పిస్తుంది అని బెంచ్ పేర్కొంది.
ఎన్నికల తదనంతర హింస వల్ల ఇబ్బంది పడ్డ ప్రజలు మళ్లీ వారి సాధారణ జీవితం, వ్యాపార కార్యకలాపాలు శాంతియుతంగా నిర్భయంగా జరుపునేటట్లు చేపట్టవలసిన చర్యలు గురించి కూడా ఈ కమిటీ సూచనలు చేస్తుంది అని బెంచ్ చెప్పింది.
ఈ కమిటీలో వెస్ట్ బెంగాల్ హ్యూమన్ రైట్స్ కమిటీ మెంబర్ మరియు WBSLSA సెక్రటరీ కూడా సభ్యులుగా ఉంటారు అని పేర్కొంది.
ఈ కమిటీ సభ్యులు బాధితులతో నేరుగా మాట్లాడటం, ఆయా ప్రదేశాలను పరిశీలించడం కూడా చేస్తారు.
ఈ హింసాత్మక సంఘటనలు పై వెస్ట్ బెంగాల్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (WBSLSA)కి జూన్ 10వ తేదీ వరకు 3284 మంది బాధితులు ఫిర్యాదు చేశారు. WBSLSA సెక్రటరీ ప్రకారం బాధితులు సంబంధిత పోలీస్ స్టేషన్స్ లోనూ, సూపరెంటెండెంట్ కి ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదు అని చెప్పారు.
ఈ హింసాత్మక సంఘటలను WBSLSA
6 వర్గాలుగా విభజించింది. అవి –
1. ఆస్తుల లూటీ/దోపిడీ మరియు విధ్వంసం
2. బెదిరింపులు వల్ల ఇళ్లు, ఆస్తులు వదులుకొని వేరే ప్రాంతాలకు వలసపోయిన వారు
3. స్త్రీలపై హింస అత్యాచారాలు/మానభంగాలు
4. ఆస్తులు పూర్తిగా/పాక్షికంగా లాక్కోవడం, కబ్జా చెయ్యడం, అతిక్రమించడం
5. వ్యాపార సంస్థలు పై దాడులు వాటిని పూర్తిగా మూసివేయించడం
6. బలవంతపు వసూళ్లు/బెదిరింపు వసూళ్లు
హై కోర్టు నియమించిన కమిటీకి బెంగాల్ ప్రభుత్వం అన్ని సహాయ సహకారాలు అందించాలని, వారికి ఇబ్బందులు కానీ ఆటంకాలు కానీ సృష్టిస్తే కోర్టు సీరియగా తీసుకొని కోర్టు ధిక్కార నేరం గా పరిగణించాల్సి వస్తుంది అని హెచ్చరించింది.
మేం నియమించిన కమిటీ నేరాలు చేసిన వారిని గుర్తించడంతో పాటు ఆ నేరాల ఫిర్యాదులపై మౌనం వహించిన పోలీసు, మిగతా అధికారుల వివరాలు సేకరించాలి. అలాగే గతంలో వచ్చిన ఫిర్యాదులు ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవలసిన పునరావాస చర్యలు గురించి మేము జూన్ 4వ తేదీన సూచనలు చేసాం. వాటిని రాష్ట్రప్రభుత్వం ఏ మేరకు ఆచరణలో పెట్టిందో కూడా తెలుసుకోగోరుతున్నాం.
తదుపరి విచారణ ఈ నెల 30 వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.
…చాడా శాస్త్రి..