బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
భారత రక్షణ, పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణిని ఇండియన్ నేవీ విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణిని కోల్కతా శ్రేణి డెస్ట్రాయర్ ఐఎన్ఎస్ చెన్నై యుద్ధ నౌక నుంచి పరీక్షించారు. అరేబియా మహాసముద్రంలోని నిర్దేశిత టార్గెట్ను ఈ మిసైల్ కచ్చితత్వంతో ఛేదించింది. బ్రహ్మోస్ ఒక ప్రైమ్ స్ట్రైక్ ఆయుధం. బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి నౌకాదళం ద్వారా సుదూరంలోని ఉపరితల లక్ష్యాలను చేధించడం ద్వారా యుద్ధనౌక సామర్ధ్యాన్ని పెంచుతుంది. ఈ క్షిపణి పరీక్ష విజయవంతంపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్.. డీఆర్డీఓ,బ్రహ్మోస్,ఇండియన్ నేవీ అధికారులను అభినందించారు.
ఇక బ్రహ్మోస్ క్షిపణులు భారత సాయుధ దళాల సామర్థ్యాలను అనేక విధాలుగా పెంచుతాయని డీఆర్డీవో చైర్మన్ జి.సతీష్ రెడ్డి తెలిపారు. బ్రహ్మోస్ క్షిపణులు దాదాపు 400 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా సులువుగా ఛేదించగలవు.
భారత్ అమ్ములపొదిలో కీలకమైన బ్రహ్మోస్ సామర్థ్యాన్ని పెంచడంపై డీఆర్డీవో దృష్టి సారించింది. బ్రహ్మోస్ క్షిపణులు దాదాపు 400 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా సులువుగా ఛేదించగలవు. మరోవైపు ఈ ప్రయోగానికి వినియోగించిన ఐఎన్ఎస్ చెన్నై 2016 నుంచి తన సేవలు అందిస్తోంది. ఇండియన్ నేవీ ప్రాజెక్టు 15A లో భాగంగా స్వదేశీయంగా దీనిని అభివృద్ధి చేశారు. బ్రహ్మోస్, బరాక్-8 క్షిపణులు, దేశీయంగా అభివృద్ధిచేసిన యాంటీ సబ్మెరైన్ ఆయుధాలు, సెన్సార్లు, భారీ టోర్పెడో ట్యూబ్ లాంచర్లు, రాకెట్ లాంచర్లు ఈ యుద్ధ నౌకలో ఉంటాయి.